కరోనా వైరస్ కట్టడి చర్యలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ నేడు మేయర్లు, పురపాలక చైర్మన్లు, కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఏర్పాట్లు, కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు సమావేశంలో చర్చించారు.
కరోనా కట్టడి చర్యలపై మంత్రుల సమీక్ష