శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్


తిరుమల‌ శ్రీవారిని కోదాడ ఎమ్మల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఎమ్మెల్యే మల్లయ్యకు టిటిడి అధికారులు వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ తెలిపారు.